Skip to main content

ఉన్నత చదువులతో బాగా ఎదగాలి.. మనవడు గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో సీఎం

రాయదుర్గం (హైదరాబాద్‌):విద్యార్థులంతా ఉన్నత చదువులు చదివి, జీవితంలో మరింతగా ఎదగాలని.. సమాజానికి గొప్పగా సేవలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించారు.
Should grow well with higher studies
ఉన్నత చదువులతో బాగా ఎదగాలి.. మనవడు గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో సీఎం

ఏప్రిల్‌ 18న హైదరాబాద్‌ శివార్లలో ఖాజాగూడలోని ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 12వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు జరిగాయి. ఈ స్కూల్‌లోనే చదువుతున్న కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు కూడా పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌–శోభ దంపతులు, కేటీఆర్‌–శైలిమ దంపతులు, హిమాన్షు సోదరి అలేఖ్య, అమ్మమ్మ, మేనమామలు, ఇతర బంధువులు కూడా హాజరయ్యారు.

చదవండి: Naina Jaiswalకు డాక్టరేట్‌.. దేశంలోనే అతి పిన్న వయస్కురాలు

Himanshu

 

పట్టా అందుకున్న హిమాన్షు దానిని తాత కేసీఆర్‌ చేతిలోపెట్టి పాదాలకు నమస్కరించారు. కేసీఆర్‌ మనవడిని హత్తుకుని అభినందించారు. కేటీఆర్‌–శైలిమ కూడా తమ కుమారుడిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. హిమాన్షుతోపాటు ఇతర విద్యార్థులంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇక కమ్యూనిటీ యాక్టివిటీ సర్విసెస్‌ (సీఏఎస్‌) విభాగంలో ప్రతిభ చాటినందుకు హిమాన్షు ఓక్రిడ్జ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును అందుకున్నారు.  

చదవండి: Archery World Cup: డిప్యూటీ కలెక్టర్‌, ఆర్చర్ జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు

Himanshu

 

Published date : 19 Apr 2023 03:12PM

Photo Stories