Naina Jaiswalకు డాక్టరేట్.. దేశంలోనే అతి పిన్న వయస్కురాలు
Sakshi Education
కాచిగూడ: దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ 22 ఏళ్ల వయస్సులోనే పీహెచ్డీలో డాక్టరేట్ డిగ్రీ పొందారు.
Naina Jaiswalకు డాక్టరేట్.. దేశంలోనే అతి పిన్న వయస్కురాలు
హైదరాబాద్లోని నారాయణగూడ ప్రాంతానికి చెందిన నైనా జైస్వాల్..ఏపీలోని రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం’ అనే అంశంపై నైనా జైస్వాల్ పరిశోధన చేశారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్ను రిసెర్చ్ గైడ్, యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ఎం.ముత్యాల నాయుడు అభినందించారు.