సాక్షి, అమరావతి: 2022–23 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎంఎస్, వివిధ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖా స్తు చేసుకున్న విద్యార్థుల ప్రాథమిక మెరిట్ జాబితాను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నవంబర్ 2న విడుదల చేసింది.
మెడిసిన్ ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల
10,690 మంది విద్యార్థులకు మెరిట్ జాబితాలో స్థానం దక్కింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం 152 మంది అనర్హులుగా మిగి లారు. వీరి జాబితాను ప్రకటించారు. జాబితాను https://drntruhs.in/index.htmlలో చూడొచ్చు.
విద్యార్థులు అభ్యంతరాలను నాలుగో తేదీ సాయంత్రం లోగా ysrugmedadm22@gmail.comకు పంపాల్సి ఉంటుంది. గడువు ముగిసిన అనంతరం అందిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోరు.