Skip to main content

ఉన్నత విద్యార్థులకు క్విజ్ పోటీలు ప్రారంభం

రాష్ట్రంలో మొదటిసారిగా ఉన్నత విద్యావ్యవస్థలోని విద్యార్థులకు రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీలను ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ఏప్రిల్‌ 20న నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు.
Quiz competitions start for high school students
ఉన్నత విద్యార్థులకు క్విజ్ పోటీలు ప్రారంభం

విద్యార్థుల్లో పోటీతత్వానికి చేయూత ఇవ్వడంతో పాటు వారికి నగదు పురస్కారాలను ఇచ్చేలా కార్యక్రమాలను ప్రారంభించినట్లు వివరించారు. క్విజ్‌ కాంపిటీషన్‌–2022, బెస్ట్‌ ఇన్నోవేషన్, బెస్ట్‌ కమ్యూనిటీ సర్వీస్‌ తదితరాలను ప్రారంభిస్తున్నామన్నారు. 700కు పైగా బృందాలకు ఆ¯ŒSలై¯ŒS పరీక్ష నిర్వహించి 40 బృందాలను ఎంపిక చేస్తామని, వారికి ప్రత్యక్ష విధానంలో క్విజ్‌పోటీ ఉంటుందని చెప్పారు. మొదటిరోజు వచ్చిన 31 బృందాల నుంచి 16 బృందాలను ఎంపికచేసి గురువారం క్వార్టర్‌ ఫైనల్స్, వీటి ద్వారా ఎనిమిది టీమ్‌లకు సెమీఫైనల్స్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో గెలుపొందిన నాలుగు బృందాలకు 22వ తేదీ ఫైనల్స్‌ నిర్వహించి విజేతలకు బహుమతులిస్తామన్నారు. మొదటి బహుమతిగా రూ.1 లక్ష, రెండో బహుమతిగా రూ.60 వేలు, మూడో బహుమతిగా రూ.30 వేలు, నాలుగో బహుమతిగా రూ.10 వేల నగదు, సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారు.

Sakshi Education Mobile App
Published date : 21 Apr 2022 12:23PM

Photo Stories