Skip to main content

Degree Admissions: ఈ కళాశాలలో ప్రవేశం పొందే విద్యార్థులకు ఉచితంగా దోస్త్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

ఏటూరు నాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు చేరాలని లెక్చరర్లు మార్చి 13న‌ ప్రచారం చేపట్టినట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చిన్న తెలిపారు.
March 13 Campaign for Inter-Completed Students   Promotion on Degree Admissions    Free Dost Online Registration for Degree College Admissions

ఏటూరు నాగారం డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు కరపత్రాలను అందజేసి ప్రభుత్వ కళాశాలలో చేరాలని ఆహ్వానించారు.

చదవండి: S Nikita Degree Topper: డిగ్రీ ఫలితాల్లో ప్రతిభ చాటిన ఎస్‌ నికిత

కళాశాలలో ప్రవేశం పొందే విద్యార్థులకు ఉచితంగా దోస్త్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ రిజిస్ట్రేషన్‌ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు గన్‌సింగ్‌, రేణుక, కనీస్‌ఫాతిమా, వెంకటయ్య, జ్యోతి, సురేష్‌ పాల్గొన్నారు.
 

Published date : 15 Mar 2024 11:45AM

Photo Stories