జగిత్యాలటౌన్: ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వకుండా బదిలీ చేయడం సరికాదని తపస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య, ప్రసాద్రావు అన్నారు.
ప్రమోషన్లు లేని బదిలీలు వద్దు
అక్టోబర్ 3న ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నార ని, పదోన్నతి షెడ్యూల్ ప్రకటించి తీరా ఇప్పుడు ఎస్జీటీల బదిలీ మాత్రమే చేయాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5శాతం మధ్యంతర భృతి ఆమోదయోగ్యం కాదని, 20శాతం వెంటనే ప్రకటించాలని తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఐఆర్ ప్రకటించడం శోచనీయమని పేర్కొన్నారు.