National Education Policy: జాతీయ విద్యా విధానం వార్షికోత్సవం
Sakshi Education
తిరుపతి సిటీ: ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జూలై 29న జాతీయ విద్యా విధానం మూడో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించనున్నారని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ చెప్పారు.
జాతీయ విద్యా విధానం వార్షికోత్సవం
ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. జూలై 24న ఎస్వీ యూనివర్సిటీలో తిరుపతిలోని కేంద్ర విద్యాసంస్థలు, యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థి స్వేచ్ఛగా తనకు నచ్చిన కోర్సును ఎంచుకునే వెసులుబాటు కలిగిందన్నారు.