ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మున్సిపల్ స్కూళ్లలో అదనపు తరగతి గదులు
నాడు–నేడు మొదటి, రెండో దశల కింద ఎంపిక కాని పాఠశాలల్లో ఈ అదనపు తరగతి గదులు నిర్మిస్తారు. మున్సిపల్ పాఠశాలల్లో 2021 దాదాపు 20 శాతం మంది అదనంగా విద్యార్థులు చేరారు. దాంతో కొత్త తరగతి గదుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. అందుకోసం మున్సిపల్ కమిషనర్లు ఆయా పాఠశాలలను సందర్శించి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది.