సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కాలర్షిప్కు అర్హత లేని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కరోనా నేపథ్యంలో రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించి ఫీజులో 40% మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యా శాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
బాసర విద్యార్థుల ఫీజుల మినహాయింపు: సబిత
2018–19, 2019–20 విద్యా సంవత్సరాల్లో కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు జరగకపోవడం, వసతి గృహాల నిర్వహణ లేకపోవడం వల్ల విద్యార్థులపై భారం పడకుండా ఈ మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.