Skip to main content

Skills: నైపుణ్యాల పెంపుతో స్థానికంగానే ఉపాధి

నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా యువత స్థానికంగానే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నది సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని, ఇందులో భాగంగానే స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Skills
నైపుణ్యాల పెంపుతో స్థానికంగానే ఉపాధి

దీనిలో భాగంగా 30 వరకూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తాడేపల్లిలో అక్టోబర్‌ 8న అప్లైడ్‌ రోబో కంట్రోల్‌ సర్టిఫికేషన్‌ ఆన్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ కోర్సును సజ్జల లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండో యూరోసింక్‌ అండ్‌ జర్మన్ వర్సిటీ సంస్థ రాష్ట్రంలో 2,400 మందికి రోబోటిక్‌ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా రోబో స్కిల్‌ కప్‌ పేరుతో పోటీ పెట్టి రూ.3 లక్షల మేర ప్రోత్సాహకాన్ని అందించడాన్ని సజ్జల ప్రశంసించారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జర్మనీ సంస్థ సహకారంతో 2019 నుంచి ఇప్పటి వరకు 1200 మంది విద్యార్థులు ఫస్ట్‌ లెవల్‌ కోర్సు పూర్తి చేసి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు.

చదవండి:

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. టైంటేబుల్‌లో మార్పులు

ఆన్ లైన్ ప్రవేశాలకు వెబ్‌ లింక్‌

Published date : 09 Oct 2021 01:24PM

Photo Stories