Skip to main content

కేవీ విద్యార్థినికి డిప్యూటీ స్పీకర్‌ అభినందన

విజయనగరం: ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఏపీ, తెలంగాణ కేంద్రియ విద్యాలయ సంఘటన్‌ రీజినల్‌ క్రీడా పోటీల్లో విజయనగరానికి చెందిన కేంద్రియ విద్యాలయం విద్యార్థిని సత్తా చాటింది.
Deputy Speaker congratulated the KV student
విశ్వకృపను అభినందిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల

అండర్‌–17 విభాగంలో 9వ తరగతి చదువుతున్న పి.విశ్వకృప డిస్క్‌ త్రో లో బంగారం, రిలేలో కాంస్య పతకాలు సాధించింది. ఈ సందర్భంగా జూలై 23న‌ ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామిని ఆయన నివాసం వద్ద ఆమె మర్యాదపూర్వకంగా కలిసింది.

చదవండి: ముగ్గురు విద్యార్థులకు ఎక్స్‌లెన్స్‌ అవార్డులు

ఈ నేపథ్యంలో ఆమె సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్న కోలగట్ల..ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, మరిన్ని పతకాలు సాధించి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

చదవండి: Indira Gandhi Peace Prize-2021: ఇందిరా గాంధీ శాంతి బహుమతికి ఎంపికైన సంస్థ?

Published date : 24 Jul 2023 03:14PM

Photo Stories