NAAC A+ Grade for JNTUK: భవిష్యత్లో విదేశీ వర్సిటీలతో ఎంవోయు... సీఎం జగన్ అభినందనలు
Sakshi Education
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ కాకినాడ యూనవర్సిటీకు న్యాక్ ఏప్లస్ రావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు.
Congratulations CM Jagan on NAC A Plus status
గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వీసీల సదస్సులో జేఎన్టీయూకే వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజును అభినందించి రాష్ట్ర స్థాయిలో సాంకేతిక వర్సిటీలో కీలకంగా ఉన్న జేఎన్టీయూ కాకినాడకు ఈ హోదా రావడం సంతోషమని, భవిష్యత్లో విదేశీ వర్సిటీలతో ఎంవోయులకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారని వీసీ ప్రసాదరాజు తెలిపారు.