Biometric Attendance: కాలేజీ విద్యార్థులకూ బయోమెట్రిక్
Sakshi Education
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో విద్యార్థులు సహా బోధన, బోధనేతర సిబ్బందికి Biometric Attendanceను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం అదేశించింది.
కాలేజీ విద్యార్థులకూ బయోమెట్రిక్
ఈ మేరకు అక్టోబర్ 12న విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని సంస్థల్లో విధిగా బయోమెట్రిక్ అమలును అందుబాటు లోకి తేవాలని కొన్ని రోజుల క్రితమే అంతర్గత ఆదేశాలిచ్చి నట్టు అధికారులు తెలిపారు.