Skip to main content

ISO Certification: ఏపీఎస్‌ఎస్‌డీసీకి ఐఎస్‌ఓ గుర్తింపు

సాక్షి, అమరావతి: ఆంధ్ర­ప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యా­భి­వృద్ధి సంస్థ (ఏపీఎస్‌­ఎస్‌డీసీ), క్వాలిటీ మేనే­జ్‌­మెంట్‌ సిస్టం విభాగంలో ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డైజేషన్‌ (ఐఎస్‌ఓ) 9001 2015 సర్టిఫికెట్‌ దక్కించుకోవడం ఆనందంగా ఉందని సంస్థ ఎండీ, సీఈఓ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు.
Quality Management System certification awarded to APSSDC by ISO  APSSDC is ISO accredited  APSSDC achieves ISO 9001:2015 certification

ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ రావడం సంస్థకు గర్వకారణమని,  ఈ ఘనత సాధించేందుకు కారణమైన సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు తాడేపల్లి­లోని ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రధాన కార్యాలయంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.సురేశ్‌ కుమార్, ఎండీ, సీఈవో డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ కలిసి ఐఎస్‌ఓ 9001:2015 సర్టిఫికెట్‌ అందుకున్నారు.

చదవండి: Special Story: అతిగా దాచుకోవడం కూడా జబ్బే.. అని మీకు తెలుసా!?

అనంతరం  సురేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఐఎస్‌ఓ గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సర్టిఫికెట్‌ మరింత బాధ్యత పెంచిందనీ, దాన్ని నిలబెట్టుకునేందుకు మరింత బాగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సర్టిఫికేషన్‌ను హైదరాబా­ద్‌కు చెందిన గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అందించింది.

Published date : 03 Apr 2024 01:46PM

Photo Stories