Skip to main content

AP schools: పాఠశాలల్లో జాగ్రత్తలు తీసుకోవాలి

నంద్యాల(న్యూటౌన్‌): వానలు పడుతుండటంతో ఉపాధ్యాయులు పాఠశాలల్లో జాగ్రత్తలు తీసుకోవాలని డీఈఓ సుధాకర్‌రెడ్డి సూచించారు.
AP schools: Care should be taken in schools
AP schools: Care should be taken in schools

డీఈఓ సుధాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న గదుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదన్నారు. అలాగే నూతన గదుల నిర్మాణం కోసం తీసిన గుంతల వైపు వెళ్లకుండా చూడాలన్నారు. ప్రహరీగోడల దగ్గర సైకిళ్లు ఉంచడం, విద్యార్థులు నిలవడం వంటివి చేయరాదన్నారు. అలాగే వాగులు, వంకలు దాటి పాఠశాలకు రావాల్సి వస్తే పిల్లలు తల్లిదండ్రుల తోడు తీసుకోవాలన్నారు.

Also read: AP Schools: నాడు–నేడు అభివృద్ధి పనుల పరిశీలన: కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌

 

Published date : 27 Jul 2023 03:44PM

Photo Stories