Skip to main content

Dr G Rameswara Rao: చదువుతోపాటు నైపుణ్యం పెంచుకోవాలి

రాయదుర్గం: యువత, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారు చదువుతోపాటు నైపుణ్యాలను అభివృద్ధి పర్చుకోవాలని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ డాక్టర్‌ జి రామేశ్వరరావు సూచించారు.
Along with education skills should be developed

 గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్‌ స్టాప్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌తో కలిసి ‘లెవల్‌–04–స్టాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌’ పేరిట న‌వంబ‌ర్ 3న‌ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాజరైన డాక్టర్‌ రామేశ్వరరావు మాట్లాడుతూ నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ మార్గదర్శకత్వంలో భారత నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ(ఎంఎస్‌డీఈ)పీఎంకేవివై 4.0 కింద స్పాన్సర్‌ చేసిన ఫ్లాగ్‌షిప్‌తో ఈ శిక్షణ సాధ్యమైందన్నారు.

చదవండి: Andhra Pradesh: విద్యార్థినులకు ‘స్వేచ్ఛ’తో భరోసా

విద్య, పరిశ్రమల ఽమధ్య అంతరాన్ని తగ్గించడానికి ఎస్కీ, మల్లారెడ్డి కళాశాల సంయుక్తంగా కృషి చేస్తున్నాయన్నారు. పీఎంకేవివై 4.0 ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ రంగంలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, విజ్ఞానంతో విద్యార్థులను సన్నద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. మల్లారెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అశోక్‌, ఎంఆర్‌ఈసీ హెడ్‌ డాక్టర్‌ వి.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Published date : 04 Nov 2023 03:26PM

Photo Stories