తొలి ప్రయత్నంలోనే Indian Forest Service (IFS)లో ఆలిండియా 86వ ర్యాంకు సాధించిన కాసర్ల రాజును తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ సన్మానించారు.
ఐఎఫ్ఎస్ ర్యాంకర్ రాజుకు రూ.లక్ష ప్రోత్సాహకం
జూలై 8న Forest College and Research Institute (FCRI) ఆధ్వర్యంలో అరణ్య భవన్లో రాజు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు ఎఫ్సీఆర్ఐ తరపున రూ.లక్ష ప్రోత్సాహకాన్ని అందజేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా సూరారం గ్రామంలోని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాజు ఎంతో కష్టపడి ఐఎఫ్ఎస్ సాధించి, పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించారని ప్రశంసించారు. రాజు మాట్లాడుతూ.. ఎఫ్సీఆర్ఐ నుంచి తనకు మంచి సహకారం లభించిందని చెప్పారు. కార్యక్రమంలో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ పాల్గొన్నారు.