Skip to main content

APPSC: నేటి నుంచి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు

APPSC Departmental Exams from Today

ఏలూరు(మెట్రో): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఏవీఎన్‌ఎస్‌ మూర్తి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ చాంబర్‌లో మెడికల్‌, పోలీస్‌, ఆర్టీసీ, విద్యుత్‌ శాఖల అధికారులతో డిపార్ట్‌మెంట్‌ పరీక్షల నిర్వహణపై డీఆర్‌ఓ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎవీఎన్‌ఎస్‌ మూర్తి మాట్లాడుతూ ఆగస్టు 2 నుంచి 7 వరకు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు పెదపాడు మండలం వట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్‌ సీబీఎస్‌ఈ స్కూల్‌లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు వివిధ శాఖలకు చెందిన 181 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని పోలీస్‌ అధికారులకు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఏపీపీఎస్సీ ఎస్‌వో ప్రేమకుమారి, ఏఎస్‌ఓ ఎం.భవాని, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రసాద్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Teacher Jobs: టీచర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

Published date : 19 Aug 2023 10:43AM

Photo Stories