Skip to main content

APPSC: డిపార్టుమెంటల్‌ పరీక్షలు తేదీలు ఇవే..

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన డిపార్టుమెంటల్‌ పరీక్షలను జూన్‌ 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌ జూన్‌ 1న తెలిపారు.
APPSC
డిపార్టుమెంటల్ పరీక్షలు తేదీలు ఇవే..

ఈ పరీక్షకు 55,036 మంది హాజరుకానున్నారు. సవివర టైమ్‌ టేబుల్‌ను https://psc.ap.gov.inలో పొందుపరిచినట్లు వివరించారు. స్క్రీనింగ్‌ టెస్టుకు ఏర్పాట్లు ఎండోమెంటు ఈవో, రెవెన్యూ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఆఫ్‌లైన్లో నిర్వహించనున్న స్క్రీనింగ్‌ టెస్టుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేపట్టింది. ఎండోమెంటు ఈవో పోస్టులకు జూలై 24న, రెవెన్యూ జూనియర్‌ అసిస్టెంటు పోస్టులకు జూలై 31న స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించనున్నారు.

చదవండి: 

Published date : 02 Jun 2022 01:27PM

Photo Stories