పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి AP POLYCET–2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పాలిసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ తేదీ ఇదే..
జూలై 8న జరిగిన అకడమిక్ క్యాలెండర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు అడ్మిషన్ల కౌన్సెలింగ్పై తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు ఆగస్టు 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆయన వివరించారు.