Skip to main content

AP Police: ఎస్‌ఐ పోస్టుల ప్రిలిమినరీ పరీక్షకు సర్వంసిద్ధం.. అభ్యర్థులకు సూచనలు ఇవే..

సాక్షి, అమరావతి: ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు పోలీసు నియామక మండలి పూర్తి ఏర్పాట్లు చేసింది.
preliminary examination of AP SI posts
ఎస్‌ఐ పోస్టుల ప్రిలిమినరీ పరీక్షకు సర్వంసిద్ధం.. అభ్యర్థులకు సూచనలు ఇవే..

సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 19న నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో పేపర్‌–1ను ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, పేపర్‌–2ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. కాగా పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 291 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1.71 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఈ నేపథ్యంలో రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పోలీసు నియామక మండలి సూచనలు జారీ చేసింది. 

చదవండి: AP పోలీస్ - స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | వీడియోస్

అభ్యర్థులకు సూచనలు.. 

  • పరీక్ష రోజు గాబరా పడకుండా ఒక రోజు ముందుగానే తమ పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో చూసుకోవాలి.
  • పేపర్‌–1కు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి, పేపర్‌–2కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్ష హాల్లోకి  అనుమతిస్తారు.
  • హాల్‌టికెట్‌తో పాటు బ్లూ/బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌ తెచ్చుకోవాలి. 
  • గుర్తింపు కార్డుగా ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డ్, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్‌ కార్డుల్లో ఏదైనా తీసుకురావాలి. 
  • మొబైల్‌ ఫోన్, టాబ్లెట్‌/ల్యాప్‌టాప్, పెన్‌ డ్రైవ్, బ్లూటూత్‌ పరికరాలు, స్మార్ట్‌ వాచ్, కాలిక్యులేటర్, లాగ్‌ టేబుల్, వాలెట్, పర్సు, నోట్స్, చార్ట్‌లు వంటివాటితో పాటు ఎలాంటి కాగితాలు, రికార్డింగ్‌ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. వాటిని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లూ చేయడం లేదు.
Published date : 18 Feb 2023 03:21PM

Photo Stories