Inter Advance Supplementary పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి.
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ
ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు Andhra Pradesh Board of Intermediate Education జూన్ 24న షెడ్యూల్ విడుదల చేసింది. Practical Tests ఆగస్టు 17 నుంచి 22 వరకు జరుగుతాయి. నైతికత, మానవ విలువలు పరీక్ష ఆగస్టు 24న.. పర్యావరణ విద్య పరీక్ష ఆగస్టు 26న జరుగుతాయి. విద్యార్థులు నిర్ణీత ఫీజులను జూలై 8లోపు చెల్లించాలని పేర్కొంది.