Skip to main content

AP ICET 2022 Results Date : ఏపీ ఐసెట్‌ ఫలితాలు ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూలై 25న నిర్వహించిన ఏపీ ఐసెట్‌–2022 ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు పోటెత్తారు.
AP ICET 2022 Results
AP ICET 2022 Results

మొత్తం 49,157 మంది దరఖాస్తు చేయగా, 42,496 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 86.45 శాతం హాజరు నమోదైందని సెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 నగరాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 70.92 శాతం హాజరు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో అత్యధికంగా 93.3 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 93.1, పశి్చమ గోదావరి జిల్లాలో 93 శాతం మంది హాజరయ్యారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని, ప్రాథమిక కీ ని మాత్రం జూలై 27వ తేదీన విడుదల చేయనున్నారు. అలాగే ఐసెట్‌–2022 ఫలితాలను ఆగస్టు 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఫలితాలను విడుదల చేసే రోజే ఫైనల్‌ కీ విడుదల చేయనున్నారు. ఏపీ ఐసెట్ 2022 ఫ‌లితాల కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌(www.sakshieducation.com)లో చూడొచ్చు.

ఏపీ ఐసెట్‌ కాలేజ్ & ర్యాంక్‌ ప్రిడిక్ట‌ర్ కోసం క్లిక్ చేయండి

How to check AP ICET 2022 Results?

  • Visit results.sakshieducation.com or sakshieducation.com
  • Click on AP ICET 2022 Results link available on the home page
  • In the next page, enter your hall ticket no. and click on submit
  • The results will be displayed on the screen
  • Save a copy of the marks sheet for further reference
Published date : 26 Jul 2022 05:55PM

Photo Stories