Skip to main content

AP EDCET 2023: నోటిఫికేషన్‌ విడుదల

ఏయూ క్యాంపస్‌: రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

మార్చి 24న నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని చెప్పారు. 2023–24 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందేవారు సత్వరం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

చదవండి: EAMCET 2023: పేపర్లకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ

ఏప్రిల్‌ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, రూ.1000 అపరాధ రుసుముతో మే 2వ తేదీ వరకు, రూ.2000 అపరాధ రుసుముతో మే 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. మే 20వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. దరఖాస్తు పూర్తి వివరాలకు www.cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

చదవండి: EAMCET 2023: దరఖాస్తుల వరద.. ఇన్ని వేల దరఖాస్తులు ఇతర రాష్ట్రాల నుంచి..

Published date : 25 Mar 2023 03:05PM

Photo Stories