రాయచోటి: వ్యవహారిక తెలుగుభాషకు వెలుగు గిడుగు రామ్మూర్తి అని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కొనియాడారు. ఆగస్టు 29న కలెక్టరేట్లో గిడుగు రామ్మూర్తి జయంతి నిర్వహించారు.
తెలుగుభాషకు వెలుగు ప్రతీక ’గిడుగు’
ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి జేసీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగువాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగురామ్మూర్తి అని జేసీ కొనియాడారు. తెలుగు భాషకు తొలి అడుగు గిడుగు రామ్మూర్తి అన్నారు. తెలుగుభాష ఉన్నంతవరకు గిడుగురామ్మూర్తి చిరస్మరణీయునిగా ఉంటారన్నారు.
అనంతరం గిడుగురామ్మూర్తి చిత్రపటానికి కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణ, పర్యాటకశాఖ అధికారి నాగభూషణం, సమాచారశాఖ డీఐపీఆర్ఓ భరత్ కుమార్ రెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.