Skip to main content

Yoga: యోగాలో విద్యార్థుల ప్రతిభ

Yoga
Yoga

పీసీపల్లి: పీసీపల్లికి చెందిన విద్యార్థులు యోగాలో ప్రతిభ చూపారు. యోగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీల్లో 10–12 ఏళ్ల బాలికల విభాగంలో పెద్దవరిమడుగు పాఠశాలకు చెందిన స్వర్ణ, అశ్విని ద్వితీయయస్థానం, 8–10 వయస్సుల బాలికల విభాగంలో మృదుల ప్రథమస్థానం, కె.సాయి సహస్ర ద్వితీయస్థానం, పీసీపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన 10–12 ఏళ్ల బాలుర విభాగంలో ఏడుకొండలు, రేవంత్‌ సాయి ద్వితీయ, తృతీయ స్థానాలు, 12–14 ఏళ్ల బాలుర విభాగంలో సాయి సంజయ్‌ ద్వితీయస్థానం, 14–16 ఏళ్ల బాలుర విభాగంలో టి.గణేష్‌ ద్వితీయ స్థానంలో ప్రతిభకనపరిచారు. వీరంతా సెప్టెంబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారు.

వీరిని ఈ స్థాయిలో ప్రతిభ కనపరిచే విధంగా తీర్చిదిద్దినటువంటి యోగా గురువు స్వర్ణ రమణయ్యను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

Published date : 21 Aug 2023 05:44PM

Photo Stories