Skip to main content

YVT Chandrika: సైన్స్‌ సెమినార్‌లో మార్కాపురం విద్యార్థినికి అవార్డు

మార్కాపురం టౌన్‌: మార్కాపురం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని వైవిటి చంద్రిక విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్‌ సెమినార్‌లో ఆరో స్థానంలో నిలిచి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నట్లు హెచ్‌ఎం శ్రీదేవి తెలిపారు.
Award to Markapuram student in science seminar
సైన్స్‌ సెమినార్‌లో మార్కాపురం విద్యార్థినికి అవార్డు

మిల్లెట్స్‌ ఏ సూపర్‌ ఫుడ్‌ అనే అంశంపై చంద్రిక ప్రదర్శనకు జ్యూరీ అవార్డు వచ్చినట్లు తెలిపారు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ బి. ప్రతాప్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకున్నట్లు చెప్పారు. శనివారం ఒంగోలులో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో చంద్రిక ప్రథమ స్థానం సాధించడంపై పండిత పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి రవిచంద్ర అభినందించారు.

చదవండి:

Education Minister: మన విద్యార్థులు యూఎన్‌ఓకు వెళ్లడం రాష్ట్రనికే గర్వకారణం

Scholarship Application: విద్యార్థుల‌ స్కాలర్‌షిప్‌ల ద‌ర‌ఖాస్తు గ‌డువు..

Published date : 26 Sep 2023 03:44PM

Photo Stories