పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ
Sakshi Education
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు నవంబర్ 28న బాధ్యతలు స్వీకరించారు.
విజయవాడ ఇబ్రహీంపట్నంలోని కమిషన్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఫీజులను నియంత్రించడంతో పాటు విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, పాఠశాల విద్యా సంచాలకులు ఎస్.సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | మోడల్ పేపర్స్ 2022 | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
Published date : 29 Nov 2022 02:59PM