TS Constable Preliminary Exam 2022 : కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత‌ప‌రీక్ష‌కు జిల్లాల వారిగా ఎంత మంది హాజ‌ర‌య్యారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో కానిస్టేబుల్‌, తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్ష‌ను ఆగ‌స్టు 28వ తేదీ (ఆదివారం) ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జరిగిన విష‌యం తెల్సిందే. సివిల్‌ కానిస్టేబుల్‌ కోటాలోని 15,644, రవాణా శాఖ 63, అబ్కారీ 614 పోస్టులకు ఈ ప‌రీక్ష నిర్వ‌హించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. 6,61,196 మంది అభ్య‌ర్థులు ఈ ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌.. వీరితో రాత ప‌రీక్ష‌కు 6,03,955 హాజ‌ర‌య్యారు.

ఈ రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన‌ ‘కీ’ ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించింది.

టీఎస్‌ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ప‌రీక్ష 2022 కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’ కోసం క్లిక్ చేయండి

TS SI Preliminary Exam Question Paper With Key (Click Here)

కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహించారు. మొత్తం ఎనిమిది విభాగాల నుంచి ప్రశ్నలు అడిగారు. అవి..ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్‌ సైన్స్, భారత దేశ చరిత్ర–సంస్కృతి–భారత జాతీయోద్యమం, భౌగోళిక శాస్త్ర సిద్ధాంతాలు–భారత భౌగోళిక శాస్త్రం–పాలిటీ–ఎకానమీ; జాతీయ–అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కలిగిన అంశాలు. వీటిలో ఇంగ్లిష్‌ మినహా మిగతా విభాగాలకు తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇచ్చే వెసులుబాటు కల్పించారు. 200 మార్కులతో కూడిన ప్రశ్నాపత్రంలో, తప్పుడు సమాధానానికి 0.2 నెగెటివ్‌ మార్కు ఉంటుంది.

#Tags