Sheikh Latif & Madira Srinivasa Reddy: ఫైర్ సర్వీస్లో డ్రైవర్ ఆపరేటర్లుగా ఎంపికై న లారీ డ్రైవర్లు
Sakshi Education
హుజూర్నగర్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏప్రిల్ 2న ప్రకటించిన ఫైర్ సర్వీస్లో డ్రైవర్ ఆపరేటర్ (ఏఎస్ఐ) ఫలితాల్లో హుజూర్నగర్ మండలానికి చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు ఎంపికయ్యారు.
![Fire Service Driver Operator results announcement. Lorry drivers selected as driver operators in fire service Telangana State Police Recruitment Board announcement.](/sites/default/files/images/2024/04/04/sheikhlatif-madirasrinivasareddy-1712225976.jpg)
హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామానికి చెందిన షేక్ లతీఫ్ 5వ జోన్లో మొదటి ర్యాంక్, మదిర శ్రీనివాస్రెడ్డి 5వ జోన్లో ఐదో ర్యాంక్ సాధించి ఫైర్ సర్వీస్లో డ్రైవర్ ఆపరేటర్(ఏఎస్ఐ)గా ఎంపికయ్యారు. వీరిద్దరూ చిన్నతనం నుంచి మంచి మిత్రులు.
గత 6 సంవత్సరాలుగా లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ సమయం దొరికినప్పుడు చదువుకునేవారు. హైదరాబాద్లో కోచింగ్ కూడా తీసుకున్నారు. లతీఫ్కు ఓపెన్లో 10వ తరగతి పూర్తిచేయగా.. శ్రీనివాస్ ఇంటర్ పూర్తి చేశాడు.
చదవండి:
Published date : 04 Apr 2024 03:49PM