Admissions: ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట : మైనార్టీ గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ (జీ)1 ప్రిన్సిపాల్ కృష్ణకుమారి జనవరి 24న ఒక ప్రకటనలో తెలిపారు.
6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను (మైనారిటీలకు మాత్రమే) ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. tmreis.telangana.gov.inలో వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివరాలకు హనుమకొండ సుబేదారిలోని వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయం, హనుమకొండ కేయు క్రాస్రోడ్డులోని బాలికల గురుకులం, 9985885799, 9948436006 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
చదవండి:
6th Class Admissions: ఈ స్కూళ్లు విద్యార్థులకు వరం.. ఒక్కో పాఠశాలలో 100 సీట్లు..
#Tags