Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల తేదీ పొడిగింపు.. దోస్త్‌ గడువు పెంపు..

భారీ వర్షాలతో వరుస సెలవులు, ఇంటర్నెట్, ఇతర ఇబ్బందుల నేపథ్యంలో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును జూలై 25 నుంచి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఇంటర్‌ బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది. ఇంకా లక్ష మందికిపైగా ఇంటర్‌లో చేరాల్సి ఉందని.. వానలు ఇలాగే కొనసాగితే గడువు పొడి గించాలని బోర్డ్‌ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.
ఇంటర్‌ ప్రవేశాల తేదీ పొడిగింపు.. దోస్త్‌ గడువు పెంపు..

వర్సిటీల్లో పరీక్షలు వాయిదా.. దోస్త్‌ గడువు పెంపు

ఉస్మానియా, జేఎన్టీయూహెచ్‌ సహా పలు యూని వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో అంతర్గత పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఈ నెలాఖరులో నిర్వ హించాలని భావించినా.. వానలు తగ్గే అవకాశం లేకపోవడంతో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు ఆలస్యం కాను న్నాయి.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ​​​​​​​ఏపీ ఇంటర్

డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్‌ కౌన్సెలింగ్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తేదీని జూలై 28 వరకూ పొడిగించారు. ఇక ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆప్షన్ల గడువు 27తో ముగియనుంది. జూలై 31న సీట్ల కేటాయింపు ఉంటుందని సాంకేతిక విద్య కమిషనరేట్‌ తెలిపింది. వర్షాలు తగ్గకపోతే రెండో విడత చేరికల తేదీని పొడిగించే వీలుందని అధికారులు అంటున్నారు.  

#Tags