TSWREIS: ఎస్సీ గురుకుల సొసైటీలో చదువుపై ఏకాగ్రతను పెంచేందుకు ఈ తరగతులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలోని పాఠశాలల్లో మెడిటేషన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి వెల్లడించారు.

విద్యార్థుల్లో మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గించి చదువుపై ఏకాగ్రతను పెంచేందుకు ఈ తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు. ఇటీవల విద్యార్థులు ఒత్తిడితో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్షిణి వివరించారు.

చదవండి: School Holidays Calender Release: అకడమిక్ క్యాలెండర్‌ విడుదల.. పాఠశాలలు మొత్తం ఇన్ని రోజులు పనిచేయనున్నాయి!

మెడిటేషన్‌ తరగతుల నిర్వహణ కోసం బ్రహ్మకుమారీస్‌ సంస్థతో సొసైటీ అవగాహన కుదుర్చుకుందని, ఇందులో భాగంగా గురుకుల టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. వచ్చే నెల రెండోవారం నుంచి గురుకులాల్లో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. 

#Tags