విషజ్వరాల బారిన 100 మంది గురుకుల విద్యార్థులు

సిర్పూర్‌(టి): కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి)లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలోని విద్యార్థులు విషజ్వరాలతో బాధపడుతున్నారు.

ఈ విద్యా సంస్థల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు 500 మంది విద్యార్థులు ఉన్నారు. గురుకుల సిబ్బంది శ్రద్ధ తీసుకోకపోవడంతో ప్రస్తు తం 100మంది వరకు జ్వరాల బారిన పడిన ట్లు తెలుస్తోంది.

చదవండి: గురుకులం.. కష్టాల నిలయం

సెప్టెంబర్ 8న‌ పలువురి ఆరోగ్య పరి స్థితి విషమించడంతో 23 మంది విద్యార్థులను సిర్పూర్‌(టి) సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 15 మంది డిశ్చార్జి కాగా 8 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.

#Tags