Tokyo Paralympics 2020: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది?

టోక్యో పారాలింపిక్స్‌–2020 ముగిశాయి. జపాన్‌ రాజధాని నగరం టోక్యోలో 2021, ఆగస్టు 24న ప్రారంభమైన ఈ విశ్వ క్రీడలు సెప్టెంబర్‌ 5న ముగిశాయి. ఆగస్టు 25 నుంచి ప్రధాన పోటీలు ప్రారంభం కాగా... మొత్తం 162 దేశాలు క్రీడల్లో పాల్గొన్నాయి.

24వ స్థానంలో భారత్‌...
టోక్యో పారాలింపిక్స్‌లో చైనా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చైనా 96 స్వర్ణాలు, 60 రజతాలు, 51 కాంస్యాలతో కలిపి మొత్తం 207 పతకాలు సాధించి తొలి స్థానంలో నిలిచింది. 124 పతకాలతో బ్రిటన్‌ (41 స్వర్ణాలు, 38 రజతాలు, 45 కాంస్యాలు) రెండో స్థానంలో... 104 పతకాలతో అమెరికా (37 స్వర్ణాలు, 36 రజతాలు, 31 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచాయి. భారత్‌ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలు సాధించి 24వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా 78 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. తదుపరి పారాలింపిక్స్‌ 2024లో పారిస్‌లో జరుగుతాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టోక్యో పారాలింపిక్స్‌–2020 ముగింపు
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 5, 2021
ఎవరు    : జపాన్‌
ఎక్కడ    : టోక్యో, జపాన్‌
 

#Tags