Maheshwari Chauhan: షూటింగ్లో భారత్కు 21వ ఒలింపిక్ బెర్త్
Sakshi Education
పారిస్ ఒలింపిక్స్ చివరి క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో భారత మహిళా స్కీట్ షూటర్ మహేశ్వరి చౌహాన్ రజత పతకం సాధించింది.
![Skeet Shooter Maheshwari Takes India's Quota Tally To 21](/sites/default/files/images/2024/04/29/maheshwari-chauhan-1714383650.jpg)
దీంతో భారత్కు 21వ ఒలింపిక్ బెర్త్ ఖరారైంది.
దోహాలో ఏప్రిల్ 28వ తేదీ జరిగిన స్కీట్ ఈవెంట్ ఫైనల్లో మహేశ్వరి ‘షూట్ ఆఫ్’లో 3–4తో ఫ్రాన్సిస్కా క్రొవెట్టో (చిలీ) చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 60 షాట్ల తర్వాత ఇద్దరూ 54–54తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ధీరజ్.. ఇందులో మూడో స్థానంలో..
Published date : 29 Apr 2024 03:10PM