JA Training Classes: జూనియర్‌ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులు

మందమర్రిరూరల్‌: ఇటీవల సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగం సాధించిన 40 మందికి ఏరియాలోని గనుల వృత్తి శిక్షణా కేంద్రం (ఎంవీటీసీ)లో మార్చి 4న‌ ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం మనోహర్‌ హాజరై తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగం సాధించడం అభినందనీయమన్నారు.

ఐదు రోజుల పాటు ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ ఫ్యాకల్టీచే నిర్వహించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం రాజేశ్వరరెడ్డి, ఎంవీటీసీ మేనేజర్‌ గుండేటి శంకర్‌, అసిస్టెంట్‌ ట్రెయినీ మేనేజర్‌ అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Indian Navy Officer Recruitment 2024: నావికా దళంలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివ‌రి తేదీ ఇదే..

కొత్త కోర్సులు ప్రారంభం

ఏరియాలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో గ్యాస్‌, ఆర్క్‌ వెల్డింగ్‌ కోర్సుల శిక్షణ తరగతులను జీఎం ప్రారంభించారు. 24 మంది నిరుద్యోగ యువకులకు నాలుగు వారాలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

#Tags