Fake Notification: అది ఫేక్‌ నోటిఫికేషన్‌: సజ్జనార్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రకటనను నమ్మొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పష్టంచేశారు.

ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ఆ భర్తీ ప్రక్రియను టీజీపీఎస్సీ, పోలీస్, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులు సంయుక్తంగా చేపట్టనున్నాయి.

ఇప్పటివరకు ఆయా సంస్థలు షెడ్యూల్‌ను ప్రకటించలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఓ ఫేక్‌ నోటిఫికేషన్‌ వైరల్‌గా మారింది. ఈ పోస్టుల భర్తీకి ఆర్టీసీ చర్యలు చేపట్టిందని పేర్కొంటూ ఓ బోగస్‌ నోటిఫికేషన్‌ను సోషల్‌ మీడియాలో కొందరు వైరల్‌ చేశారు.

చదవండి: Agniveer MR Notification : అగ్నివీర్‌–ఎంఆర్‌ నోటిఫికేషన్‌.. పదో తరగతి అర్హతతో పోటీ పడే అవకాశం

అందులో ఉన్న లింకును క్లిక్‌ చేసి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వివరాలను నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. అయితే ఇది ఫేక్‌ నోటిఫికేషన్‌ అని, అభ్యర్థులెవరూ మోసపోవద్దని సజ్జనార్‌ తెలిపారు. 

#Tags