Ninth Class Admissions: ఈ రెండు జిల్లాల్లో తొమ్మిదో తరగతికి దరఖాస్తుల ఆహ్వానం..

అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైనా తొమ్మిదో తరగతికి ఈ పాఠశాలల్లో ప్రవేశ దరఖాస్తులు చేసుకోవచ్చని ఆర్‌సీవో తెలిపారు..

కామారెడ్డి: టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐ సంస్థ కరీంనగర్‌ జిల్లా అలుగునూర్‌ పాఠశాల (కో-ఎడ్యుకేషన్‌), రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి(బాలికలు) పాఠశాలల్లో తొమ్మిదో తరగతి సీట్లను మాత్రమే భర్తీ చేయనున్నట్లు ఆర్‌సీవో అలివేలు తెలిపారు. అలుగునూర్‌ పాఠశాలలో 80 సీట్లు బాలికలు, 80 సీట్లు బాలురకు, గౌలిదొడ్డిలో 80 సీట్లు బాలికలు ఉన్నట్లు వివరించారు.

History Researcher: చరిత్ర పరిశోధకునికి తెలుగు విశ్వవిద్యాలయం అందించిన పురస్కారం

ఈ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి సిలబస్‌తోపాటు ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని తెలిపారు. 9వ తరగతిలో ప్రవేశానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు.

#Tags