Gurukul Admissions: ఈనెల 31వ తేదీ వరకు గురుకుల ప్రవేశానికి దరఖాస్తులు

విద్యార్థినులు తమ గురుకుల ప్రవేశానికి దరఖాస్తులు చేసుకునేందుకు తేదీని విడుదల చేశారు. ప్రకటించిన తేదీలోగా విద్యార్థినులు దరఖాస్తులు చేసుకొని ప్రవేశ పరీక్షకు సిద్దంగా ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు వివరాలు..

భవానీపురం: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయం (మైనార్టీ బాలికలు)లో ప్రవేశాలకు విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (భవానీపురం) ప్రిన్సిపాల్‌ ఎస్‌. శివకుమారి ఓ ప్రకటనలో కోరారు. కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆయా జిల్లాల్లోని ముస్లిం, మైనార్టీలు, రిజర్వేషన్‌ ప్రకారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Technology for Innovation: ఉపాధ్యాయులు బోధనలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ను వినియోగించాలి

2024–25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి అన్ని సీట్లకు, అలాగే 6, 7, 8 తరగతులకు మిగిలి ఉన్న సీట్లకు ప్రవేశ పరీక్ష (ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌ – 2024) అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలలో ఏప్రిల్‌ 25న జరుగుతుందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు https://aprs.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 8712625036 నంబర్‌లో సంప్రదించాలనికోరారు.

Underwater Metro: నీటి అడుగున నడ‌వ‌నున్న‌ మెట్రో రైలు.. దీని విశేషాలు ఇవే..

#Tags