నవోదయలో ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్: చిలకలూరిపేట మండలం మద్దిరాలలోని నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో చేరేందుకు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని అర్హత గల విద్యార్థులు ఎటువంటి రుసుం లేకుండా నవోదయ.జీవోవీ.ఇన్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీవైఈఓ, ఎంఈఓలతో పాటు ప్రధానోపాధ్యాయులకు సూచించారు. నవోదయ ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 20న గుంటూరు, తెనాలి, మంగళగిరిలలో నిర్వహిస్తారని వెల్లడించారు.
ఈనెల 7న వ్యాసరచన, వక్తృత్వ పోటీలు
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 7న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని డీఈఓ శైలజ తెలిపారు. ‘‘సెలెబ్రేటింగ్ ఇండియన్ హ్యాండ్లూమ్స్: వీవింగ్ అవర్ కల్చరల్ హెరిటేజ్’’ అనే అంశంపై పోటీలను పెట్టాలని సూచించారు.
#Tags