AP CM YS Jagan Mohan Reddy : మ‌నం పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువే.. అందుకే మ‌నం ప్రపంచస్థాయి విద్యకు..

సాక్షి ఎడ్యుకేస‌న్ : మ‌నం పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని.. అందుకే ప్రపంచస్థాయి విద్యకు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పీట వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

నేడు (న‌వంబ‌ర్ 14వ తేదీ) బాలల దినోత్సవం సందర్భంగా ఎక్స్‌ ద్వారా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులూ అర్పించారు. మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ.. ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్‌వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామ‌ని సందేశంలో సీఎం జగన్‌​ తెలియజేశారు.

 

#Tags