Job Mela: రేపు జాబ్‌మేళా..వీళ్లు అర్హులు

సిద్దిపేటఎడ్యుకేషన్‌: సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఈ నెల 24న నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రవీందర్‌రెడ్డి గురువారం తెలిపారు. హెచ్‌సీఎల్‌, టెక్‌ బి కంపెనీల సౌజన్యంతో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బైపీసీ, సీఈసీ, కంప్యూటర్‌ సైన్స్‌లో 2023–24 విద్యా సంవత్సరంలో 75శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు.

Jobs In TCS: గ్రాడ్యుయేట్లకు అవకాశం..టీసీఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

ఈ జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థులు టెన్త్‌, ఇంటర్‌ సర్టిఫికెట్లతో పాటు ఆధార్‌ కార్డు, ఒక పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫొటోతో ఉదయం 9 గంటల వరకు కళాశాలలో హాజరు కావాలని సూచించారు. కంపెనీ ప్రతినిధులు సర్టిఫికెట్లను పరిశీలించి, ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెప్పారు.

#Tags