JEE(Advanced) 2024:ఐఐటీలో సీటు సాధించిన తండా విద్యార్థి

JEE(Advanced) 2024:ఐఐటీలో సీటు సాధించిన తండా విద్యార్థి

కుభీర్‌: మండలంలోని రంజని తండాకు చెందిన రాథోడ్‌ రవికిరణ్‌ అసోం రాష్ట్రం గౌహతిలోని ఐఐటీలో సీటు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జా తీయస్థాయిలో 161 ర్యాంకు సాధించాడు. దీంతో గౌహతి ఐఐటీలో సీటు వచ్చింది. రవికిరణ్‌ 7వ తరగతి వరకు భైంసాలోని వాసవి పాఠశాలలో చదవగా 8వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ కళాశాలలో చదివాడు. రవికిరణ్‌ తల్లి అంగన్‌వాడీ కార్యకర్త, తండ్రి ఉపాధిహామీలో సీసీగా పనిచేస్తున్నారు. మారుమూ ల తండాలో పుట్టి ఐఐటీలో సీటు సాధించిన రవికిరణ్‌ను గ్రామస్తులు అభినందించారు.

Also Read:  NEET UG 2024 Counselling : నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ ఆగస్ట్‌ 14 నుంచి ..

#Tags