PGCET State Ranker : పీజీసెట్‌లో రాష్ట్ర‌స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని..!

కంబాలచెరువు: పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రవేశ పరీక్షల్లో (పీజీ సెట్‌) స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల బయో టెక్నాలజీ విద్యార్థిని ఎస్‌టీవీ సుష్మ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ కైవసం చేసుకుంది. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్ర ఆర్‌కే శుక్రవారం ఈ విషయం తెలిపారు. ఈ పరీక్షల్లో తమ విద్యార్థులు పది మందికి పైగా సింగిల్‌ డిజిట్‌ ర్యాంకులు, 15 మందికి పైగా రెండంకెల ర్యాంకులు సాధించారని వివరించారు. అనేక మంది మూడంకెల ర్యాంకులు సాధించారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందించారు.

Students Academic Books : అధిక బ‌రువును మోస్తున్న విద్యార్థులు.. ఈ పాఠ్య‌పుస్త‌కాల‌తోనే బోధ‌న చేయాలి..

 

#Tags