PG Seats Allotment: వర్సిటీల్లో మొదటి విడత పీజీ సీట్ల కేటాయింపు

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల మొదటి విడత పీజీ సీట్ల కేటాయింపు జాబితాను సెప్టెంబర్ 8న‌ విడుదల చేశారు.

ఈ విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఇతర పీజీ కోర్సుల్లో 21,505 మంది విద్యార్థులు ఆయా వర్సిటీల క్యాంపస్‌ కాలేజీలతో పాటు అనుబంధ, ప్రైవేటు పీజీ కాలేజీల్లో సీట్లు సాధించినట్లు టీజీపీసీఈటీ–2024 కన్వీనర్‌ పాండురంగారెడ్డి వెల్లడించారు.

చదవండి: Good Food For Youth: యువత ఈ ఫుడ్ తీసుకుంటే...బెస్ట్‌ హెల్త్‌ మీదే..

పీజీ మొదటి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించిన 21,505 మంది విద్యార్థుల్లో రెండింతలు 15,694 బాలికలు కాగా.. ఒక వంతు 5,811 మంది మాత్రమే బాలురు ఉన్నారు. సీటు లభించిన విద్యార్థులు ఈనెల 13 వరకు ఆయా కాలేజీల్లో టీసీ, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఫీజు చెల్లించాలన్నారు.

#Tags