AP EAMCET 2024 Toppers: ఎంసెట్ ఫలితాల్లో టాపర్స్.. జిష్ణు సాయి,శ్రీశాంత్ రెడ్డిలకు ఫస్ట్ ర్యాంక్
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 3,62,851 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు.
AP EAMCET Results Released: ఎంసెట్-2024 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఇంజనీరింగ్లో 1,95,092 మంది విద్యార్ధులు అర్హత సాధించగా, అగ్రికల్చరల్లో 70,352 మంది విద్యార్ధులు అర్హత సాధించారు. దీని ప్రకారం ఇంజనీరింగ్లో 75.51 % ఉత్తీర్ణత నమోదు కాగా, అగ్రికల్చరల్లో 87.11% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఇంజనీరింగ్ విభాగంలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు
- మాకినేని జిష్ణు సాయి- ఫస్ట్ ర్యాంక్
- మురసాని సాయి యశ్వంత్ రెడ్డి -2వ ర్యాంకు
- భోగలాపల్లి సందీష్- 3వ ర్యాంకు
అగ్రికల్చరల్ విభాగంలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు
- యెల్లు శ్రీశాంత్ రెడ్డి(తెలంగాణ)- ఫస్ట్ ర్యాంకు
- పూల దివ్యతేజ- 2వ ర్యాంకు
- వడ్లపూడి ముకేష్ చౌదరి- 3వ ర్యాంకు
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఫలితాల కోసం డైరెక్ట్ లింక్ ఇదే..
ఎంసెట్- ఇంజనీరింగ్ ఫలితాల కోసం డైరెక్ట్ లింక్ ఇదే..
AP EAMCET 2024 పూర్తి వివరాలు ఇవే..