B Tech Semester Results : బీటెక్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల..
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో మే, 2024లో నిర్వహించిన బీటెక్ రెండో సంవత్సరం, రెండో సెమిస్టర్ (ఆర్–20) , బీటెక్ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–20) రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదల చేశారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ చేతుల మీదుగా ఫలితాలు ప్రకటించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఈ. అరుణ కాంతి, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ డి. విష్ణువర్ధన్, డాక్టర్ డి. లలితకుమారి, పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం. రామశేఖర్ రెడ్డి, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ జి. మమత, సివిల్ విభాగాధిపతి అజిత తదితరులు పాల్గొన్నారు.
#Tags