TG EDCET 2024: ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ తేదీల్లో మార్పులు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీఎడ్‌సెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌లో మార్పులు చేశారు.

మార్పు చేసిన తేదీలను సెట్‌ కన్వీనర్‌ పి.రమేశ్‌ బాబు తెలిపారు. ఆగస్టు 8 నుంచి మొదలైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఈ నెల 23 వరకూ కొనసాగిస్తారు. ఆగ‌స్టు 24 నుంచి 26 వరకూ వెబ్‌ ఆప్షన్లు ఇవ్వొచ్చు. 27వ తేదీన వెబ్‌ ఆప్షన్లు సవరించుకునే అవకాశం కల్పించారు.

చదవండి: DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా 3 నెలల పాటు శిక్షణ అందిస్తామన్న మినిస్టర్‌

ఆగ‌స్టు 30వ తేదీన సీట్ల కేటాయింపు ప్రకటిస్తారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీలోగా తమకు సీటు వచ్చిన కళాశాలలో విద్యార్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.   

#Tags