‘Sakshi’ ఆధ్వర్యంలో EAPCET, NEET విద్యార్థులకు మాక్‌టెస్టులు

సాక్షి ఎడ్యుకేషన్‌: అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజినీరింగ్‌/మెడికల్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు.

అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌/అగ్రికల్చర్‌ తదితర కోర్సుల్లో అడ్మిషన్‌ కల్పించే ఈఏపీసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఈఏపీసెట్, నీట్‌ పరీక్షలకు సాక్షి మాక్‌టెస్టులు నిర్వహించనుంది.

టెక్నాలజీ పార్ట్నర్‌గా మై ర్యాంక్‌ వ్యవహారిస్తున్నది. పరీక్షకు కొద్ది రోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్‌ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌న్‌స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు.

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

ఆసక్తి గల అభ్యర్థులు  https://www.arenaone.­in/mock ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌న్‌ఫీజు రూ.250. రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్‌ 22 చివరి తేదీ. రిజిస్టర్‌ చేసుకున్న ఈమెయిల్‌కు హాల్‌ టికెట్‌ నంబర్‌ వస్తుంది. ఏప్రిల్‌ 27వ తేదీన నీట్, ఏప్రిల్‌ 28న ఈఏపీసెట్‌ అగ్రికల్చర్,ఇంజనీరింగ్‌ పరీక్షలుంటాయి.

ఈ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా పరీక్ష రాసుకోవచ్చు. పరీక్ష సమయం 3:00 గంటలు. ఈ పరీక్షలను మీ హాల్‌ టికెట్‌ నంబర్‌ (యూజర్‌ నేమ్‌), ఫోన్‌ నెంబర్‌ (పాస్‌వర్డ్‌)తో ఆ సమయంలో ఎప్పుడైనా లాగిన్‌ అయ్యి రాసుకోవచ్చు.

చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

అలాగే పరీక్ష ముగిసిన వెంటనే మీ స్కోర్‌ను కూడా చూసుకోవచ్చు. మాక్‌ పరీక్షలను  https://sakshimocktest.myrank.­co.in వెబ్‌సైట్‌లో నిర్వహిస్తారు. టెస్ట్‌కి సంబంధించిన కీ ని ఏప్రిల్‌ 30న ఇదే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు: 95055 14424, 96660 13544, 96665 72244.  

#Tags